Delhi: దేవునితో మాట్లాడటానికి 4 గంటలు మౌనదీక్ష చేశా: కేఏ పాల్
ABN , First Publish Date - 2022-07-16T23:06:04+05:30 IST
రాజ్ఘాట్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) మౌన దీక్ష ముగిసింది. విభజన హామీల అమలు కోసం పాల్ 4 గంటలు దీక్ష చేశారు.
ఢిల్లీ: రాజ్ఘాట్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) మౌన దీక్ష ముగిసింది. విభజన హామీల అమలు కోసం పాల్ 4 గంటలు దీక్ష చేశారు. దీక్ష ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక మంది పెద్దలను కోరినా హామీలు అమలు కాలేదన్నారు. దేవునితో మాట్లాడటానికి 4 గంటలు మౌనదీక్ష చేశానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రజాప్రయోజనాలు ముఖ్యం కాదని విమర్శించారు. 20న మరోసారి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆగస్టు 15లోగా హామీలు అమలు చేయకుంటే ఆమరణ దీక్ష చేస్తానని తెలిపారు. తెలుగు సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావని చెప్పారు. కేంద్రం ఏపీ (AP)కి ప్రత్యేక హోదా, తెలంగాణ (Telangana)కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మౌన దీక్షకు సీఎం కేసీఆర్, సీఎం జగన్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించారు. దీక్షకు వచ్చే నేతలకు ప్రత్యేకంగా ఢిల్లీకి విమానాలు ఏర్పాటు చేస్తానని కేఏ పాల్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేద్దామని పాల్ పిలుపునిచ్చారు.