పాతబస్తీలో నేడు, రేపు కార్యకర్తలు, పార్టీ నేతలతో Scindia భేటీ
ABN , First Publish Date - 2022-07-29T14:19:48+05:30 IST
హైదరాబాద్లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(jyotiraditya Scindia) పర్యటించనున్నారు.
Hyderabad : హైదరాబాద్లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(jyotiraditya Scindia) పర్యటించనున్నారు. లోక్సభ ప్రవాస్ యోజన(Loksabha Pravas Yojana)లో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ సింధియా.. పాతబస్తీలో నేడు, రేపు కార్యకర్తలు, పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మలక్పేట, చాంద్రయణగుట్ట, గోషామహల్, చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ పరిధిలో పర్యటించనున్నారు. ఫలక్నుమా ప్యాలెస్లో ఆయన బస చేయనున్నారు. సాయంత్రం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు బీజేపీ పార్లమెంట్ కోర్ కమిటీతో సింధియా భేటీ కానున్నారు.