భారత జట్టులో జ్యోతి సురేఖకు చోటు

ABN , First Publish Date - 2021-03-03T01:34:55+05:30 IST

మరో తెలుగు తేజానికి తగిన గుర్తింపు లభించింది

భారత జట్టులో జ్యోతి సురేఖకు చోటు

అమరావతి: మరో తెలుగు తేజానికి తగిన గుర్తింపు లభించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఆర్చరీ విభాగంలో ప్రపంచ కప్ కోసం కాంపౌండ్ ఉమెన్స్ విభాగంలో భారత జట్టుకు తెలుగుతేజం జ్యోతి సురేఖ ఎంపికయింది. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్వంలో హర్యానాలో సెలెక్షన్ నిర్వహించారు. ఆర్చరీలో జ్యోతి సురేఖ చూపెడుతున్న ప్రతిభను గుర్తించి ప్రపంచ కప్ కోసం వెళ్లే భారత జట్టుకు ఎంపిక చేశారు. జ్యోతి సురేఖ  ఎంపిక కావడం పట్ల క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-03-03T01:34:55+05:30 IST