కాంగ్రెస్తోనే రైతులకు న్యాయం: చిన్నారెడ్డి
ABN , First Publish Date - 2022-03-03T23:47:29+05:30 IST
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ఉద్యమం చేయడంతో రైతులకు
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ఉద్యమం చేయడంతో రైతులకు న్యాయం జరిగిందని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. ఖరీఫ్లో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో, తుఫాన్ వల్ల ధాన్యం తడిసి రైతులకు చాలా నష్టం జరిగిందన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ ఉద్యమం చేసిందన్నారు. యాసంగిలో వరి వేయవద్దంటూ ప్రభుత్వం ప్రచారం చేయడంతో వరి విస్తేర్ణం బాగా తగ్గిందన్నారు. వరి ధాన్యం కొనాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.