వావ్... వాటె రీచార్జ్ ప్లాన్... రూ. 19తో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు... పైగా ఉచిత డేటా...
ABN , First Publish Date - 2021-02-24T00:55:57+05:30 IST
ఎయిర్టెల్ వినియోగదారులకు ఓ చౌక ధర రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ధర కేవలం రూ. 19 మాత్రమే. ఈ ప్లాన్ తో రీ చార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. వివరాలిలా ఉన్నాయి.
న్యూఢిల్లీ : ఎయిర్టెల్ వినియోగదారులకు ఓ చౌక ధర రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ధర కేవలం రూ. 19 మాత్రమే. ఈ ప్లాన్ తో రీ చార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. వివరాలిలా ఉన్నాయి.
ఎయిర్టెల్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్తో మొబైల్ నెంబర్ రీచార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. భారతీ ఎయిర్టెల్... రూ. 19కే ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ అందిస్తోంది. అయితే... ఈ ప్లాన్ వాలిడిటీ రెండు రోజులు మాత్రమే. ఎయిర్టెల్ ఈ రీచార్జ్ ప్లాన్ను ‘ట్రూలీ అన్లిమిటెడ్’ కేటగిరి కింద ఉంచింది. అంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని అర్థం. మొత్తంమీద... రూ. 19 కే అన్లిమిటెడ్ కాల్స్ అనేది చెప్పుకోదగిన అంశమేనన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఇక... 200 ఎంబీ డేటా కూడా వస్తుంది.
అంతేకాదు... ప్రతీ నెలా, లేదంటే మూడు నెలలకు ఒకసారి రీచార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఒకేసారి సంవత్సరానికి రీచార్జ్ చేసుకోవచ్చు. రూ. 2698 ప్లాన్ అందుబాటులో ఉంది. దీని వాలిడిటీ 365 రోజులు. రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. దీంతోపాటు... డిస్నీ హాట్స్టర్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగానే లభించనుండడం గమనార్హం. తమ కొత్త ప్లాన్ వినియోగదారులకు పూర్తి వెసులుబాటుగా ఉంటుందని ఎయిర్టెల్ చెబుతోంది.