పేద దేశాలకు ఇప్పటివరకు అందిన వ్యాక్సిన్ డోస్‌లు 25 మాత్రమే: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2021-01-19T21:20:01+05:30 IST

పేద దేశాలకు ఇప్పటివరకు అందిన వ్యాక్సిన్ డోస్‌లు కేవలం 25 మాత్రమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)

పేద దేశాలకు ఇప్పటివరకు అందిన వ్యాక్సిన్ డోస్‌లు 25 మాత్రమే: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: పేద దేశాలకు ఇప్పటివరకు అందిన వ్యాక్సిన్ డోస్‌లు కేవలం 25 మాత్రమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ వార్షిక ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన వ్యాక్సిన్ విషయంలో పేద దేశాలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారు. కొవిడ్-19 వ్యాక్సిన్లను పంచుకోవడంలో ప్రపంచం వైఫల్యం అంచున ఉందని ఆయన చెప్పారు. 49 ధనిక దేశాల్లో ఇప్పటివరకు దాదాపు 4 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వేస్తే.. తక్కువ ఆదాయం కలిగి ఉన్న పేద దేశాల్లో కేవలం 25 వ్యాక్సిన్ డోస్‌లు వేయడం జరిగిందని వివరించారు. 


తక్కువ ఆదాయం కలిగి ఉన్న గెనీ అనే ఒక్క దేశంలో మాత్రమే ఇప్పటివరకు 25 వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చినట్టు టెడ్రోస్ చెప్పారు. ఆ 25 డోస్‌లు కూడా రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అని అన్నారు. వ్యాక్సిన్ డోస్‌లను ప్రపంచం మొత్తం న్యాయంగా పంచాలని ఆయన ప్రపంచ దేశాలను, వ్యాక్సిన్ తయారీదారులను కోరారు. ధనిక దేశాలు ‘మాకే ముందు’ అనే విధానంలో ముందుకు వెళ్లడం వల్ల పేద దేశాలు మరింత ప్రమాదానికి గురవుతున్నాయని టెడ్రోస్ అన్నారు. ఇటువంటి చర్యల కారణంగా మహమ్మారి మరింత కాలం పాటు కొనసాగుతుందన్నారు.

Updated Date - 2021-01-19T21:20:01+05:30 IST