శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2022-01-14T09:14:05+05:30 IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు పలువురు న్యాయమూర్తులు

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. వేకువజాము కైంకర్యాల అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం చేసి రంగనాయక మండపానికి చేరుకోగా టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌, హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ సతీ్‌షచంద్ర శర్మ, కర్ణాటక హైకోర్టు సీజే రీతూ రాజ్‌ అవస్థి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విజయలక్ష్మి, జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ రమేష్‌, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, ఏపీ ఉన్నత విద్య రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోవిందరాజన్‌, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్నాథ గౌడ్‌, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దినే్‌షకుమార్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2022-01-14T09:14:05+05:30 IST