జడ్జి రామకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌

ABN , First Publish Date - 2021-05-11T09:18:11+05:30 IST

జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న జడ్జి రామకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ను పీలేరు ఏడీజే కోర్టు డిస్మిస్‌ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు గత నెల 14న

జడ్జి రామకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌

నేటి నుంచి కోర్టులకు సెలవులు.. ఇప్పట్లో బెయిల్‌ మంజూరు కష్టమే! 


పీలేరు, మే 10: జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న జడ్జి రామకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ను పీలేరు ఏడీజే కోర్టు డిస్మిస్‌ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు గత నెల 14న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీకి ఆదేశించింది. ఆయన బెయిల్‌ కోసం పీలేరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, పలు పర్యాయాలు వాయిదాల అనంతరం సోమవారం దానిని కోర్టు డిస్మిస్‌ చేసింది. కోర్టులకు మంగళవారం నుంచి వేసవి సెలవులు కావడంతో రామకృష్ణకు ఇప్పట్లో బెయిల్‌ మంజూరవడం కష్టమేననిఅంటున్నారు. 

Updated Date - 2021-05-11T09:18:11+05:30 IST