ప్రముఖ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ABN , First Publish Date - 2020-03-05T15:53:36+05:30 IST

ప్రముఖ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు.

ప్రముఖ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. జర్నలిస్ట్ యూనియన్‌ నేతలు పొత్తూరి మృతికి సంతాపం తెలిపారు. పొత్తూరి వెంకటేశ్వరరావు 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన ఆయన ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పొత్తూరి మరణ వార్త తెలుసుకున్న నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్టు ఇండియా మాజీ అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్‌ సంతాపం ప్రకటించారు.

Updated Date - 2020-03-05T15:53:36+05:30 IST