‘తల్లి మాట వినకుండా బయటకు వెళ్లాడు.. ఆ తర్వాత ఏం జరిగింది?’

ABN , First Publish Date - 2020-04-03T20:21:56+05:30 IST

‘‘ఇంట్లోనే ఉండండి. కరోనాను తరిమికొట్టండి’’ దేశమంతా వినిపిస్తున్న మాట ఇది. కానీ కొంతమంది లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ

‘తల్లి మాట వినకుండా బయటకు వెళ్లాడు.. ఆ తర్వాత ఏం జరిగింది?’

హైదరాబాద్: ‘‘ఇంట్లోనే ఉండండి. కరోనాను తరిమికొట్టండి’’ దేశమంతా వినిపిస్తున్న మాట ఇది. కానీ కొంతమంది లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారం తిరుగుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీనిపై ఓ సందేశాత్మక వీడియోను టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఆలోచనలు రేకెత్తిస్తున్న ఈ వీడియో.. నెట్టింట చర్చనీయాంశమైంది. తల్లి చెప్పినా వినకుండా బయట తిరిగొచ్చిన ఓ కొడుకు.. కరోనా వైరస్‌ను తనతో పాటు ఇంటికి ఎలా మోసుకొచ్చాడు? ఆ యువకుడి కుటుంబాన్ని వైరస్ ఎలా విషాదంలో ముంచింది? అన్నది ఈ వీడియో సారాంశం.

కొన్ని రోజులుగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంపీ సంతోష్ పలు వీడియోలను, చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఎంపీ చేస్తున్న ట్వీట్లు.. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. 



Updated Date - 2020-04-03T20:21:56+05:30 IST