జియో మరో భారీ డీల్.. రూ.11,367 కోట్ల పెట్టుబడులకు కేకేఆర్ ఓకే..

ABN , First Publish Date - 2020-05-22T16:17:26+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ మరో సంచలన ఒప్పందం...

జియో మరో భారీ డీల్.. రూ.11,367 కోట్ల పెట్టుబడులకు కేకేఆర్ ఓకే..

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ మరో సంచలన ఒప్పందం ఖరారు చేసుకుంది. అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ అండ్ కంపెనీ జియోలో  రూ. 11,367 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఇప్పటి వరకు ఆసియాలో కేకేఆర్ సంస్థ పెట్టుబడుల్లో ఇదే అదిపెద్ద డీల్ కావడం విశేషం. తాజాగా ఒప్పందంతో జియోలో 2.32 శాతం ఈక్విటీ వాటా సదరు సంస్థకు దక్కనుంది. కాగా గత నెలరోజులుగా ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జెనరల్ అట్లాంటిక్, కేకేఆర్ వంటి టెక్ దిగ్గజాలు చేసుకున్న ఒప్పందాలతో జియోకి రూ.78,562 కోట్ల పెట్టుబడులు సమకూరాయి.


ఏప్రిల్ 22న 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్.. జియోలో రూ.43,574 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. తర్వాత కొద్ది రోజులకే సిల్వర్ లేక్ సంస్థ రూ.5,665.75 కోట్లతో జియోలో 1.15 శాతం వాటా తీసుకుంది. ఈ నెల 8న అమెరికాకి చెందిన మరో దిగ్గజ సంస్థ విస్టా ఈక్విటీ పార్టనర్స్ 2.32 శాతం వాటా కోసం రూ.11,367 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఇదే నెల 17న మరో గ్లోబల్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ రూ.6,598.38 కోట్లతో 1.34 శాతం వాటా కొనుగోలు చేసింది. 

Updated Date - 2020-05-22T16:17:26+05:30 IST