జిన్నా టవర్పై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు యత్నం
ABN , First Publish Date - 2022-01-27T08:36:51+05:30 IST
జిన్నా టవర్పై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు యత్నం
హిందూ ఐక్యవేదిక సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గుంటూరు(సంగడిగుంట), జనవరి 26: గుంటూరు నగరంలోని జిన్నా టవర్పై గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసేందుకు హిందూ ఐక్యపోరాట వేదిక సభ్యులు బుధవారం ప్రయత్నించారు. ఆ సంఘం కో ఆర్డినేటర్ అనిల్ బెహరా ఆధ్వర్యంలో 12 మంది కార్యకర్తలు జాతీయ జెండాను జిన్నా టవర్పై ఎగురవేసేందుకు మూడు వైపుల నుంచి ప్రయత్నించారు. అయితే ముందే సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అనిల్ బెహరా... జిన్నా టవర్పై జాతీ య జెండాను ఎగురవేస్తే తప్పేంటని ప్రశ్నించారు.