ఏపీ ప్రభుత్వానికి మరో భారీ ఝలక్..

ABN , First Publish Date - 2022-01-21T18:25:58+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం మరో భారీ ఝలక్ ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వానికి మరో భారీ ఝలక్..

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం మరో భారీ ఝలక్ ఇచ్చింది. పీఆర్సీపై ఉద్యమంలో భాగంగా వేతన, ఇతర ప్రభుత్వ బిల్లులను.. ప్రాసెస్ చేసేదిలేదని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. తాము కూడా ఉద్యమంలో పాల్గొంటున్నామని ట్రెజరీ డైరెక్టర్‌కి ఉద్యోగులు లేఖ రాశారు. సాయంత్రం లోపు బిల్లులను ప్రాసెస్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని.. కానీ కొత్త వేతన బిల్లులు, ఇతర బిల్లులను కూడా ప్రాసెస్ చేసేది లేదని ఉద్యోగులు తేల్చి చెప్పారు. తమపై ఒత్తిడి తీసుకురావద్దని పే అండ్ ఎకౌంట్స్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. మరోవైపు న్యాయ, ఉద్యోగుల సంఘం సైతం జేఏసీ కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపింది.


Updated Date - 2022-01-21T18:25:58+05:30 IST