110 దేశాలకు ఎగుమతులు

ABN , First Publish Date - 2021-02-24T08:12:24+05:30 IST

జేసీబీ ఇండియా.. దేశవ్యాప్తంగా ఉన్న 700 డీలర్‌షిప్‌ కేంద్రాల్లో 60కి పైగా ఉత్పత్తులను విక్రయిస్తోందని సంస్థ ఎండీ, సీఈఓ దీపక్‌ శెట్టి తెలిపారు..

110 దేశాలకు ఎగుమతులు

  • జేసీబీ ఇండియా ఎండీ దీపక్‌ శెట్టి 


దివాన్‌చెరువు: జేసీబీ ఇండియా.. దేశవ్యాప్తంగా ఉన్న 700 డీలర్‌షిప్‌ కేంద్రాల్లో 60కి పైగా ఉత్పత్తులను విక్రయిస్తోందని సంస్థ ఎండీ, సీఈఓ దీపక్‌ శెట్టి తెలిపారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువులో వరుణ్‌ మోటార్స్‌ జేసీబీ షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జేసీబీ ఇండియా ఎనిమిదికి పైగా విభాగాల్లో 60కి పైగా ఉత్పత్తులను ఉత్పత్తి చేయటమే కాకుండా  వీటిని 110 దేశాలకు ఎగుమతి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్‌ మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి వరుణ్‌దేవ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-02-24T08:12:24+05:30 IST