క్రీమీలేయర్ సవరణ సరికాదు: జాజుల
ABN , First Publish Date - 2020-07-11T08:48:23+05:30 IST
బీసీ క్రీమీలేయర్ సవరణను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు.
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): బీసీ క్రీమీలేయర్ సవరణను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి శుక్రవారం లేఖ రాశారు. క్రీమీలేయర్ తప్పుదోవ పట్టకుండా ఉన్నత స్థాయి కమిటీని నియమించాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం, వ్యవసాయ ఆదాయం రెండూ కలిపితే చాలా కుటుంబాలు రిజర్వేషన్లను కోల్పోనున్నాయని పేర్కొన్నారు.