కార్మికుల అభ్యునతే లక్ష్యంగా పని చేస్తా: జయరాం

ABN , First Publish Date - 2022-04-12T02:16:44+05:30 IST

కార్మికుల అభ్యున్నతి కోసం పని చేస్తానని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

కార్మికుల అభ్యునతే లక్ష్యంగా పని చేస్తా: జయరాం

కర్నూలు: కార్మికుల అభ్యున్నతి కోసం పని చేస్తానని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. సోమవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియతో మాట్లాడారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ముఖ్యమంత్రి మళ్లీ అవకాశం ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని అన్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే రెండవ పర్యాయం కూడా అవకాశం ఇచ్చారని తెలిపారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు మంత్రిగా కృషి చేస్తానని చెప్పారు. కరువు జిల్లాగా మిగిలిన కర్నూలు పాంతానికి అత్యధికంగా నిధులు రాబట్టి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యేలను అందరిని కలుపుకొని జిల్లా ప్రగతికి, రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీని అధికారంలో తీసుకురావడానికి, సీఎం జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు ఒక సైనికుడిలా పని చేస్తానని జయరాం అన్నారు. 

Updated Date - 2022-04-12T02:16:44+05:30 IST