ఏపీలో నియంతృత్వ పాలన: జయరామ్
ABN , First Publish Date - 2022-04-17T01:15:56+05:30 IST
ఏపీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని టీడీపీ ఎన్నారై కోఆర్డినేటర్ కోమటి జయరామ్ అన్నారు.
అమరావతి: ఏపీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని టీడీపీ ఎన్నారై కోఆర్డినేటర్ కోమటి జయరామ్ అన్నారు. శనివారం 'ఆంధ్రుల రాజధాని అమరావతి' ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ పుస్తకావిష్కరణలో జయరామ్ పాల్గొన్నారు. అమరావతి ఐకాస అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అమరావతి అమరవీరులకు రాజధాని రైతులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం అన్నివిధాలా సహకారం అందిస్తున్నామన్నారు. రాజధాని రైతులకు ఎన్నారైలు అండగా ఉంటారని జయరామ్ తెలిపారు.