ఉద్యమాల జయమ్మ కన్నుమూత

ABN , First Publish Date - 2020-02-25T10:05:48+05:30 IST

శ్రీకాకుళ రైతాంగ పోరాట యోధురాలు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పోతన్నపల్లి జయమ్మ(70) సోమవారం వేకువజామున మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన జయమ్మ.. 13వ ఏటనే

ఉద్యమాల జయమ్మ కన్నుమూత

పలాస రూరల్‌, ఫిబ్రవరి 24: శ్రీకాకుళ రైతాంగ పోరాట యోధురాలు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పోతన్నపల్లి జయమ్మ(70) సోమవారం వేకువజామున మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన జయమ్మ.. 13వ ఏటనే తండ్రి శృంగవరపు నర్సింహులు ప్రోత్సాహంతో తుపాకీ పట్టి... పోరుబాట వైపు అడుగులు వేశారు. పార్టీలో దళ కమాండరుగా 30 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపారు. ఈ క్రమంలో విప్లవ సహచరు డాక్టర్‌ మల్లిక్‌తో వివాహమైంది. ఆయన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో దళ నేత పోతన్నపల్లి కుమార్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 1998లో లొత్తూరు వద్ద జరిగిన ఎన్‌కౌంటరులో కుమార్‌ కూడా చనిపోయారు. ఆమె అంత్యక్రియలు మంగళవారం బొడ్డపాడులో నిర్వహించనున్నారు.

Updated Date - 2020-02-25T10:05:48+05:30 IST