AP News: జగన్ జైలులకు వెళ్ళారు కాబట్టి అందరిని జైలుకు పంపాలనుకుంటున్నారు: జవహర్
ABN , First Publish Date - 2022-08-04T18:16:49+05:30 IST
జగన్ జైలుకు వెళ్ళారు కాబట్టి అందరిని జైలుకు పంపాలనుకుంటున్నారని టీడీపీ నేత జవహర్ అన్నారు.
అమరావతి (Amaravathi): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ (CM Jagan) జైలుకు వెళ్ళారు కాబట్టి అందరిని జైలుకు పంపాలనుకుంటున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ బాబాయి గొడ్డలి పోటు నుంచి దారి మళ్ళించడానికి నారా లోకేష్ (Lokesh)ను కూడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు నందికి, పందికి తేడా తెలుసునని, వైకాపా రక్తపాతంలో నుంచి పుట్టిన పార్టీ అని, తాత రాజారెడ్డి వారసత్వం కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామిక వాదిగా లోకేష్ వుంటే.. ప్యాక్షన్ను నమ్ముకున్న వ్యక్తి జగన్ అని అన్నారు.
కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి గుప్పెట బంధించిన సీఎం జగన్.. బాబాయి వివేకా మరణంపై జరిగిన తీరును ఖండించలేని భయంతో కుటుంబ సభ్యులున్నారని జవహర్ అన్నారు. తండ్రి వైఎస్ మరణం జగన్ రాజకీయ పీఠమైతే.. పాలనా సామర్ధ్య వారసత్వం లోకేష్ అని అన్నారు. ఈ ఇద్దరి వ్యక్తిత్వంలో నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని జవహర్ వ్యాఖ్యానించారు.