విండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్కు భారీ ధర.. కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్
ABN , First Publish Date - 2022-02-12T22:34:06+05:30 IST
ఐపీఎల్ మెగా వేలంలో వెస్టిండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు.
బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలంలో వెస్టిండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ ఐపీఎల్తో అరంగేట్రం చేస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) జట్టురూ. 8.75 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. అలాగే, క్వింటన్ డికాక్ను రూ. 6.75 కోట్లకు, మనీష్ పాండేను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ను కూడా ఆ జట్టు సొంతం చేసుకుంది.
బెంగళూరులో రెండు రోజులపాటు ఈ వేలం జరగనుండగా, ఈ మధ్యాహ్నం వేలం ప్రారంభమైంది. జాసన్ రాయ్ను కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఫా డుప్లెసిస్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో దాదాపు 600 మంది ఆటగాళ్లు పాలుపంచుకుంటున్నారు. 48 ఆటగాళ్ల కనీస ధర రూ. 2 కోట్లు కాగా, 20 మంది ఆటగాళ్లు కనీస ధరను రూ. 1.5 కోట్లు, 34 మంది ఆటగాళ్ల కనీస ధర కోటి రూపాయలుగా ఉంది. ఆటగాళ్లలో 377 మంది ఇండియన్ ప్లేయర్లు కాగా, 223 మంది విదేశీ ఆటగాళ్లు పాలుపంచుకుంటున్నారు.