Janasena Janavani: ప్రజాసమస్యలు పరిష్కరించడమే జనసేన లక్ష్యం: పవన్‌

ABN , First Publish Date - 2022-07-17T18:32:48+05:30 IST

ప్రజాసమస్యలు పరిష్కరించడమే జనసేన (Janasena) లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు

Janasena Janavani: ప్రజాసమస్యలు పరిష్కరించడమే జనసేన లక్ష్యం: పవన్‌

భీమవరం: ప్రజాసమస్యలు పరిష్కరించడమే జనసేన (Janasena) లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. భీమవరంలో ‘జనసేన జనవాణి’ (Janasena Janavani) కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడుకోవాలని, ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. కానీ ప్రస్తుతం అలా జరగడంలేదన్నారు. అందుకే ప్రజాసమస్యల పరిష్కారం కోసం జనసేన జనవాణి కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. జనవాణి కార్యక్రమంలో ప్రజాసమస్యలపై పవన్ కల్యాణ్ అర్జీలు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజల నుంచి అర్జీల స్వీకరించనున్నారు. 


జనసేన పార్టీ ప్రభుత్వంపై వరుస బాణాలు ఎక్కుపెడుతోంది. నిత్యం జనంలో ఉండాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. కౌలు రైతుల భరోసా యాత్ర మొదలుకుని వరుస కార్యక్రమాలతో సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని బలంగా విశ్వసిస్తున్న పవన్‌ కల్యాణ్‌ నేరుగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగానే జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-07-17T18:32:48+05:30 IST