అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక: నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2021-12-06T01:04:24+05:30 IST
తీరప్రాంత ప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందజేస్తామని హామీ ఇచ్చారు.
అమరావతి: తీరప్రాంత ప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందజేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో మొక్కజొన్న కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పంట అమ్ముకోవాలంటే రైతులు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్దితి ఏర్పడిందని చెప్పారు. ఓటీఎస్ కోసం ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామన్నారు. డ్వాక్రా నిధులనూ ప్రభుత్వం లాక్కుంటోందన్నారు.