Posani ఇంటిపై దాడి YCP పనే.. మేము ముందే చెప్పాం: Janasena

ABN , First Publish Date - 2021-09-30T18:20:15+05:30 IST

పోసాని ఇంటిపై దాడికి తమ పార్టీకి సంబంధం లేదని జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.

Posani ఇంటిపై దాడి YCP పనే.. మేము ముందే చెప్పాం: Janasena

తిరుపతి: సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని ఇంటిపై బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడినట్లు పోలీసులకు వాచ్‌మన్ ఫిర్యాదు చేశాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని బూతుల వర్షం కురిపించడంతో ఆ పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ అనుమానాలను జనసేన ఖండించింది. పోసాని ఇంటిపై దాడికి తమ పార్టీకి సంబంధం లేదని జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. పోసాని ఇంటిపై వైసీపీనే దాడి చేసి జనసేనపై రుద్దే కుట్ర జరుగుతోందని, తాము రెండు రోజుల క్రితమే చెప్పామని, ఇప్పుడు అదే జరిగిందని కిరణ్ రాయల్ తెలిపారు. రాజకీయ వ్యహకర్త ప్రశాంత్ కిశోర్ సలహాతోనే పోసాని ఇంటిపై వైసీపీ దాడి చేసిందని ఆరోపించారు. తమ పార్టీపై వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని జనసేన నేత కిరణ్ రాయల్ పేర్కొన్నారు.  

Updated Date - 2021-09-30T18:20:15+05:30 IST