విశాఖ: కార్మికుల పక్షాన నిలబడలేని జన్మ వృథా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన ఆధ్యర్యంలో జరుగుతున్న బహిరంగ సభలో పవన కల్యాణ్ మాట్లాడారు. నేను సైతం అంటూ శ్రీశ్రీ కవితతో తన ఉపన్యాసాన్ని ఆయన ప్రారంభించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, అది భావోద్వేగ నినాదమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ నిర్ణయం బాధేసిందన్నారు. మౌలిక సదుపాయాల రంగానికి ఉక్కు కీలకమన్నారు.