కాంగ్రెస్‌ చరిత్ర సృష్టించబోతుంది: జానారెడ్డి

ABN , First Publish Date - 2021-04-16T09:29:33+05:30 IST

సాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ చరిత్ర సృష్టించబోతుందని ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు

కాంగ్రెస్‌ చరిత్ర సృష్టించబోతుంది: జానారెడ్డి

హాలియా, ఏప్రిల్‌ 15: సాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ చరిత్ర సృష్టించబోతుందని ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నల్లగొండ జిల్లా హాలియాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని ప్రజల సాక్షిగా బహిరంగ సభలో గణాంకాలతోసహా వివరించానని పేర్కొన్నారు. సాగర్‌ను ఎవరు అభివృద్ధి చేశారో గుర్తించి.. ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 52లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని, 400పైగా మండల కేంద్రాల ఏర్పాటుకు తానే ఆద్యుడినని పేర్కొన్నారు. ఎవరు వాస్తవాలు చెబుతున్నారో గుర్తించి.. అండగా నిలవాలని ప్రజలను కోరారు.

Updated Date - 2021-04-16T09:29:33+05:30 IST