‘జన్ధన్’ డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చు: ఎస్బీఐ
ABN , First Publish Date - 2020-04-10T06:26:49+05:30 IST
జన్ ధన్ ఖాతాల్లో కేంద్రం జమ చేసిన డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. లాక్డౌన్ పూర్తయ్యేలోపు నగదు...
హైదరాబాద్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): జన్ ధన్ ఖాతాల్లో కేంద్రం జమ చేసిన డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. లాక్డౌన్ పూర్తయ్యేలోపు నగదు తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదని ఎస్బీఐ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకసారి ఖాతాలో డబ్బు జమ అయితే.. తిరిగి వెనక్కి వెళ్లదని పేర్కొన్నారు.