అంబేద్కర్ జయంతి వేడుకల్లో దళిత నేతల అసంతృప్తి

ABN , First Publish Date - 2022-04-14T19:24:54+05:30 IST

జిల్లాలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో దళిత సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అంబేద్కర్ జయంతి వేడుకల్లో దళిత నేతల అసంతృప్తి

జగిత్యాల: జిల్లాలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో దళిత సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై కుర్చీలు వేసి తమను కింద కూర్చుండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ధర్మపురి నియోజకవర్గం ఇంచార్జి రాజమని సభ నుంచి వెళ్లిపోయారు. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పినప్పటికీ నేతలు వినిపించుకోని పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2022-04-14T19:24:54+05:30 IST