నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్స్ను ప్రారంభించిన జగన్
ABN , First Publish Date - 2020-08-14T22:25:54+05:30 IST
కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్స్ను క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ ఆసుపత్రి వల్ల
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్స్ను క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ ఆసుపత్రి వల్ల ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హాస్పిటల్ డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. నంద్యాల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి పాల్గొన్నారు.