కేరళ సీఎంని చూసి నేర్చుకో జగన్: కేశినేని
ABN , First Publish Date - 2020-03-27T08:45:42+05:30 IST
కరోనాని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) విమర్శించారు. ఆయన గురువారం వివిధ అంశాలపై...
విజయవాడ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కరోనాని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) విమర్శించారు. ఆయన గురువారం వివిధ అంశాలపై ట్విటర్లో స్పందించారు. కేసీఆర్, జగన్ నిర్వాకం వల్ల కొన్ని వేలమంది బాధలు పడుతున్నారన్నారు. సరైన ఆదేశాలు జారీ చేసి విద్యార్థులను ఆదుకోవాలని సూచించారు. వారిని ఆకలి దప్పికలతో చంపవద్దని విజ్ఞప్తి చేశారు. మరో ట్వీట్లో... హైదరాబాద్ టీసీఎస్కు చెందిన 13 మంది యువతులు కర్ణాటక - కేరళ సరిహద్దులో చిక్కుకున్నపుడు కేరళ సీఎం స్పందించిన తీరును ప్రస్తావించారు. ఆయనను చూసి నేర్చుకోవాలంటూ జగన్కు సూచించారు. కమ్యూనిటీ కిచెన్లను అనుసంధానించడానికి బీజేపీ ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మరో ట్వీట్లో వివరిస్తూ... రాష్ట్రంలో రోజూ కొన్ని లక్షల మందికి వండి వడ్డించగల సామర్థ్యం ఉన్న అన్న క్యాంటీన్లను అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.