జగన్కు తండ్రిపై గౌరవం ఉంటే వర్గీకరణ చేయాలి: మంద కృష్ణ మాదిగ
ABN , First Publish Date - 2020-10-01T09:19:05+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తండ్రి వైఎస్సార్పై గౌరవం ఉన్నా, తాను నమ్మే దేవుడిపై విశ్వాసం ఉన్నా తక్షణమే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు...
కందుకూరు, సెప్టెంబరు 30: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తండ్రి వైఎస్సార్పై గౌరవం ఉన్నా, తాను నమ్మే దేవుడిపై విశ్వాసం ఉన్నా తక్షణమే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణకు రాజ్యాధికార సాధనకు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సింగరాయకొండలో జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి ఉద్యమాలు చేపట్టిందన్నారు.త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలుపై ఏడుగురు లేదా తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ చేసి తీర్పు ఇవ్వనుందన్నారు. జగన్ తన వైఖరి ఏమిటో తక్షణం స్పష్టం చేయాలని కోరారు.