అరాచకంగా జగన్ పాలన: సాకే
ABN , First Publish Date - 2022-08-11T09:10:46+05:30 IST
అరాచకంగా జగన్ పాలన: సాకే
విశాఖలో ఆజాద్ కీ గౌరవ యాత్ర
దొండపర్తి(విశాఖపట్నం), ఆగస్టు 10: జగన్మోహన్రెడ్డి అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు. మోదీకి జగన్ దాసోహమయ్యారు. వారిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ను నాశనం చేస్తున్నారు’’ అని పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బుధవారం విశాఖలో ‘ఆజాద్ కీ గౌరవ యాత్ర’ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడారు. ‘‘వైసీపీకి 151 సీట్లు ఇచ్చినా ప్రత్యేక హోదా తేలేకపోయింది. విశాఖలోని రుషికొండను చూస్తే ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా వుందో అందరికీ అర్థమవుతుంది. మహిళ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ను తక్షణమే బర్తరఫ్ చేయాలి’’ అని డిమాండ్ చేశారు.