జగన్‌రెడ్డి కళ్లు తెరిపించాలి: ప్రత్తిపాటి

ABN , First Publish Date - 2021-12-16T21:21:12+05:30 IST

రైతుల తిరుపతి సభతో జగన్‌రెడ్డి కళ్లు తెరిపించాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

జగన్‌రెడ్డి కళ్లు తెరిపించాలి: ప్రత్తిపాటి

అమరావతి: రైతుల తిరుపతి సభతో జగన్‌రెడ్డి కళ్లు తెరిపించాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే.. అమరావతి రైతులు భూములను త్యాగం చేశారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టలేని వ్యక్తి 3 రాజధానులెలా నిర్మిస్తాడు? అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ఇప్పటికైనా తన దుర్మార్గపు ఆలోచనలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-16T21:21:12+05:30 IST