జగన్ అసమర్థత, అవినీతి పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి: దేవినేని
ABN , First Publish Date - 2022-04-22T23:39:39+05:30 IST
జగన్ అసమర్థత, అవినీతి, పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు
అమరావతి: జగన్ అసమర్థత, అవినీతి, పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్వాసితులకు లక్షలు ఇస్తానంటూ జగన్ బీరాలు పలికారని మండిపడ్డారు. ఎస్టీ సీట్లన్నీ తానే గెలిచానన్న అహంతో నిర్వాసితులను నట్టేట ముంచారని, నిర్వాసితులకే న్యాయం చేయలేని జగన్ పోలవరం పూర్తి చేస్తారా? అని దేవినేని ప్రశ్నించారు. కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. పోలవరాన్ని ఎప్పట్లోగా పూర్తిచేస్తారో జగన్ చెప్పాలని నిలదీశారు. ప్రాజెక్ట్లో పడిన గుంతలు పూడ్చటానికి రూ.800కోట్లు, నీళ్లు ఎత్తిపోయడానికి రూ.2 వేల కోట్లు అవుతుందా? అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్రానికి లేఖ రాస్తానని దేవినేని ఉమా తెలిపారు.