రోశయ్య కుటుంబసభ్యులకు జగన్ ఫోన్
ABN , First Publish Date - 2021-12-05T01:40:14+05:30 IST
దివంగత రోశయ్య కుటుంబసభ్యులకు ఏపీ సీఎం జగన్ ఫోన్ చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అమరావతి: దివంగత రోశయ్య కుటుంబసభ్యులకు ఏపీ సీఎం జగన్ ఫోన్ చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమని కొనియాడారు. రోశయ్య మరణం రాష్ట్రానికి తీరని లోటని జగన్ అన్నారు. రోశయ్య కన్నుమూసిన విషయం తెలిసిందే. లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. రోశయ్య చిత్రపటం వద్ద ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలు నివాళులు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏ పదవిలో ఉన్నా రాణించిన వ్యక్తి రోశయ్య అన్నారు. అజాత శత్రువని.. కాంగ్రెస్కు రోశయ్య పెద్ద ఆస్తిగా ఉండేవారన్నారు. క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు.