ఇంచార్జ్‌ మంత్రుల పనితీరుపై జగన్‌ అసంతృప్తి

ABN , First Publish Date - 2021-07-01T02:06:15+05:30 IST

జిల్లా ఇంచార్జ్‌ మంత్రుల పనితీరుపై సీఎం జగన్‌ అసంతృప్తి

ఇంచార్జ్‌ మంత్రుల పనితీరుపై జగన్‌ అసంతృప్తి

అమరావతి: జిల్లా ఇంచార్జ్‌ మంత్రుల పనితీరుపై సీఎం జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  కేబినెట్‌ భేటీలో ఇంచార్జ్‌ మంత్రుల పనితీరుపై జగన్‌ చర్చించి అసంతృప్తి చెందారు. ఇంచార్జ్‌గా ఉన్న జిల్లాలకు  వారానికి రెండు రోజులు ఎందుకు వెళ్లడంలేదని ఆరా తీశారు. అప్పగించిన జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏమిటో పూర్తిస్థాయిలో తెలిసుండాలని మంత్రులకు జగన్‌ సూచించారు. పార్టీకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మంత్రులకు జగన్‌ హితవు పలికారు. 

Updated Date - 2021-07-01T02:06:15+05:30 IST