జగన్ ఢిల్లీ టూర్‌పై నారా లోకేశ్ ఒపీనియల్ పోల్

ABN , First Publish Date - 2021-01-19T23:38:30+05:30 IST

జగన్ ఢిల్లీ టూర్‌పై నారా లోకేశ్ ఒపీనియల్ పోల్

జగన్ ఢిల్లీ టూర్‌పై నారా లోకేశ్ ఒపీనియల్ పోల్

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఒపీనియన్ పోల్ నిర్వహించారు. కేంద్రం మెడలు వంచుతాన‌న్న జగన్ రెడ్డి తానే త‌ల‌దించుకుని ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకు అని లోకేశ్ ప్రశ్నించారు. 4 అంశాలతో కూడిన పోల్ నిర్వహించారు. ప్రధాని మోదీకి జగన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫోటోను పోల్‌కు జత చేశారు. 


పోల్ పాయింట్స్ ఇవే:

1. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి తనపై ఉన్న 31 కేసుల విచారణ జాప్యానికి
2. రివర్స్ టెండరింగ్ లో బాబాయ్ మర్డర్ ని గుండెపోటుగా చిత్రీకరించడానికి
3.మూడురాజ‌ధానుల పేరుతో అమరావతిని అంతం చెయ్యడానికి
4.151 దేవాలయాలపై జగన్ రెడ్డి చేసిన దండయాత్ర ఆధారాలు బయటపెట్టొద్దని వేడుకోవడానికి



Updated Date - 2021-01-19T23:38:30+05:30 IST