Jaganవి చావు తెలివితేటలు: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-06-17T22:09:11+05:30 IST
ఈ దిక్కుమాలిన పాలన గురించి పిల్లలకూ అర్ధమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
విజయనగరం: ఈ దిక్కుమాలిన పాలన గురించి పిల్లలకూ అర్ధమైందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధరల పెంపులో జగన్ (Jagan)వి చావు తెలివితేటలని మండిపడ్డారు. ఆస్తుల కబ్జాలకు సీఎం, ఎమ్మెల్యేలు తీవ్రవాదుల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్ నుంచి విముక్తి పొందండి.. ఆంధ్రాను రక్షించండి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను డిమాండ్ చేశాకే పోలీసుల టీఏ, డీఏకు నిధులు విడుదల చేశారని తెలిపారు. సారా వ్యాపారం చేసే బొత్స సత్యనారాయణకు విద్యాశాఖా కట్టబెట్టారని విమర్శించారు. అమ్మ ఒడి కాదు.. అర ఒడి కూడా దక్కలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.