జగన్ కేసులో ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్‌పై Cbi కోర్టు విచారణ

ABN , First Publish Date - 2021-07-15T00:23:07+05:30 IST

జగన్ కేసులో ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్‌పై Cbi కోర్టు విచారణ

జగన్ కేసులో ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్‌పై Cbi కోర్టు విచారణ

హైదరాబాద్: జగన్ కేసులో ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్‌పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. ఇందూ టెక్ జోన్ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్ నుంచి తొలగించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. సీబీఐ అనవసరంగా కేసులో ఇరికించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలుకు నిమ్మగడ్డ ప్రసాద్ సమయం కోరారు. డిశ్చార్జ్ పిటిషన్ వేసే ఉద్దేశం లేదని ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలుకు విశ్రాంత అధికారి పార్థసారథిరావు సమయం కోరారు. ఇందూ టెక్ జోన్ ఛార్జ్ షీట్‌పై విచారణ ఈనెల 22కి కోర్టు వాయిదా వేసింది. అలాగే ఎమ్మార్ విల్లాల విక్రయంపై సీబీఐ, ఈడీ కేసుల విచారణ ఈనెల 28కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2021-07-15T00:23:07+05:30 IST