కొత్త పారిశ్రామిక విధానంపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-04-09T02:37:02+05:30 IST
కొత్త పారిశ్రామిక విధానంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొత్త పారిశ్రామిక విధానంలో వాస్తవిక దృక్పథం ఉండాలని సీఎం అన్నారు.
అమరావతి: కొత్త పారిశ్రామిక విధానంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొత్త పారిశ్రామిక విధానంలో వాస్తవిక దృక్పథం ఉండాలని సీఎం అన్నారు. పరిశ్రమలకు పెండింగులో ఉన్న ఇన్సెంటివ్ల చెల్లింపుపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని తెలిపారు. ఇన్సెంటివ్లు దశలవారీగా చెల్లించడానికి ప్రయత్నాలు చేయాలని సీఎం పేర్కొన్నారు. పారిశ్రామిక కాలుష్యాన్ని పూర్తిగా నివారించడానికి దృష్టిపెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వమే వ్యర్థాల సేకరణ, నిర్వహణ చేపడుతుందని సీఎం జగన్ చెప్పారు.