TS News: గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై స్పందించిన జగదీష్రెడ్డి
ABN , First Publish Date - 2022-09-09T01:44:40+05:30 IST
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి జగదీష్రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
సూర్యాపేట: గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి జగదీష్రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం.. గవర్నర్కు ఫ్యాషన్గా మారిందని, ఇది సరికాదని తప్పుబట్టారు. నిత్యం వార్తల్లో ఉండేదుకే గవర్నర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్భవన్ను ఉపయోగించుకుని గవర్నర్ బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని జగదీష్రెడ్డి దుయ్యబట్టారు.
కేసీఆర్ (KCR)కు గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) చురకలు వేశారు. తెలంగాణ సమస్యలు పరిష్కరించుకునేందుకు సీఎం అన్ని అవకాశాలను వదులుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం వివక్ష చూపుతోందని పదే పదే చెబుతున్న కేసీఆర్ దక్షాణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఎందుకు వెళ్లలేదన్నారు. సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.