కాంగ్రెస్ నేతల జలదీక్షలు.. నక్కల సంతాప సభలు: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-03T20:21:26+05:30 IST

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల జలదీక్షలు, ధర్నాలు నక్కల సంతాప సభల్లా ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ నేతల జలదీక్షలు.. నక్కల సంతాప సభలు: జగదీష్‌రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల జలదీక్షలు, ధర్నాలు నక్కల సంతాప సభల్లా ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ నాయకులేనని... మళ్లీ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ధర్నాలు, దీక్షల పేరుతో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ద్రోహులుగా మిగిలారని జగదీష్‌రెడ్డి విమర్శించారు.


నల్గొండ కాంగ్రెస్ నాయకుల చేతకానితనం వల్లనే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పోతిరెడ్డిపాడు పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకులదేనన్నారు. జానారెడ్డి, ఉత్తమ్,  కోమటిరెడ్డిలు సీమాంధ్ర నాయకుల వద్ద మొకరిల్లి నల్గొండ జిల్లాను ఎండబెట్టారన్నారు. కాంగ్రెస్ నాయకులు ద్వంద వైఖరిని విడనాడాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.







Updated Date - 2020-06-03T20:21:26+05:30 IST