కోటిరెడ్డి విజయం లాంఛనమే : జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-11-23T19:44:25+05:30 IST

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో

కోటిరెడ్డి విజయం లాంఛనమే : జగదీష్‌రెడ్డి

నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మూడు నామినేషన్ సెట్లను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కోటిరెడ్డి విజయం లాంఛనమేనని.. సాగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. ఎంసీ కోటిరెడ్డికి అభ్యర్థిగా చక్కటి అవకాశమిచ్చారన్నారు. ప్రతిపక్ష నేతలకు పోటీ అంటేనే వెన్నులో వణుకు పుడుతోందన్నారు. కోటిరెడ్డి విజయాన్ని కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వబోతున్నామని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-11-23T19:44:25+05:30 IST