మనువాదానికి మాదిగవాదమే ప్రతివాదంగా ఉద్యమం: వంగపల్లి
ABN , First Publish Date - 2020-02-20T10:08:47+05:30 IST
మనువాదానికి మాదిగవాదమే ప్రతివాదంగా ఉద్యమిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. భూపాలపల్లిలో
భూపాలపల్లి టౌన్: మనువాదానికి మాదిగవాదమే ప్రతివాదంగా ఉద్యమిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. భూపాలపల్లిలో బుధవారం మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేతలు దాన్ని అమలు చేయట్లేదన్నారు. ఈ హామీని కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డి, దివంగత నేత సుష్మాస్వరాజ్ కూడా ఇచ్చారని చెప్పారు.