మా వాళ్ల జ్ఞాపకాలు మాకివ్వండి: ఇటలీ ప్రజలు
ABN , First Publish Date - 2020-07-14T13:44:17+05:30 IST
ఇటలీలో కరోనాతో మృతిచెందిన వారికి ప్రభుత్వమే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది.
రోమ్, జూలై 13: ఇటలీలో కరోనాతో మృతిచెందిన వారికి ప్రభుత్వమే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది. ఆ సంక్షోభం నుంచి దేశం గట్టెక్కిన ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మృతుల కుటుంబీకులు గళం విప్పుతున్నారు. ఇన్ఫెక్షన్తో మృతిచెందిన తమ వాళ్ల జ్ఞాపకాలను తమకు తిరిగివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆప్తులను కడచూపుకైనా నోచుకోనీయని సర్కారు తమకు ఈ రూపంలోనైనా న్యాయం చేయాలంటూ సుమారు 100 కేసులు దాఖలు చేశారు.