వికెట్ కీపర్లు అందరూ ధోనీలానే అవాలనుకుంటారు: సంజు శాంసన్

ABN , First Publish Date - 2020-09-24T22:37:13+05:30 IST

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతడి స్థానాన్ని భర్తీ చేసే విషయంలో యువ వికెట్ కీపర్లకు అవకాశాలు

వికెట్ కీపర్లు అందరూ ధోనీలానే అవాలనుకుంటారు: సంజు శాంసన్

దుబాయ్: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతడి స్థానాన్ని భర్తీ చేసే విషయంలో యువ వికెట్ కీపర్లకు అవకాశాలు మెరుగయ్యాయి. ఈ విషయంలో ఇతర వికెట్ కీపర్లతో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఆటగాడు సంజు శాంసన్ ముందున్నాడనే చెప్పుకోవచ్చు. ఓ ఇంటర్వ్యూలో శాంసన్ మాట్లాడుతూ.. ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం ఏమంత సులభం కాదని పేర్కొన్నాడు.


 ‘‘తమ వికెట్ కీపర్ ధోనీలా కావాలని ప్రతీ దేశం కోరుకుంటుంది. ఇండియాలో మంచి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్లు ఉన్నారు. జాతీయ, దేశవాళీ జట్టులో ఈ విషయంలో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముందుకొచ్చే వారిపై చాలాపెద్ద బాధ్యత ఉంటుందన్న విషయం తెలుసు. జట్టుకు ఇప్పుడిదే పెద్ద తలనొప్పిగా మారింది. ఇక, నా విషయానికొస్తే అది మంచి స్థానం. ఎందుకంటే పోటీ ఎప్పుడూ మనల్ని మరింత మెరుగయ్యేలా చేస్తుంది’’ అని శాంసన్ పేర్కొన్నాడు. 


Updated Date - 2020-09-24T22:37:13+05:30 IST