టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎన్‌బీడబ్ల్యూ జారీ

ABN , First Publish Date - 2022-04-08T00:53:02+05:30 IST

ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎన్‌బీడబ్ల్యూ‌ జారీ అయింది. ఎమ్మెల్యేలు

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎన్‌బీడబ్ల్యూ జారీ

హైదరాబాద్: ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎన్‌బీడబ్ల్యూ‌ జారీ అయింది. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, నన్నపనేని నరేందర్‌పై నాన్ బెయిలబుల్ వారంట్‌ను ప్రజా ప్రతినిధుల కోర్టు జారీ చేసింది. విచారణకు హాజరుకానందున ఎమ్మెల్యేలపై ఎన్‌బీడబ్ల్యూ జారీ అయింది. అలాగే నిర్మల్‌లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో విచారణ ముగిసింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యల కేసు తీర్పును ఈనెల 12కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2022-04-08T00:53:02+05:30 IST