22 నుంచి బంగారు బాండ్ల జారీ

ABN , First Publish Date - 2022-08-20T06:07:46+05:30 IST

ఈ నెల 22 (సోమవారం) నుంచి మరో విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) జారీ అవుతున్నాయి. ఐదు రోజుల పాటు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్న ఈ బాండ్ల..

22 నుంచి బంగారు బాండ్ల జారీ

గ్రాము ధర రూ.5,197


ముంబై: ఈ నెల 22  (సోమవారం)  నుంచి మరో విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) జారీ అవుతున్నాయి. ఐదు రోజుల పాటు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్న ఈ బాండ్ల జారీ ధరను గ్రాముకు రూ.5,197గా నిర్ణయించినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ది సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2022-23 సీరిస్‌ 2 పేరుతో ఈ బాండ్స్‌ జారీ చేస్తారు. ఆన్‌లైన్‌ లేదా డిజిటల్‌ చెల్లింపులు చేసే వారికి గ్రాముపై రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), నిర్ణీత పోస్టాఫీసులు, బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల ద్వారా మదు పరులు ఈ ఎస్‌జీవీలు కొనుగోలు చేయవచ్చు. 

Updated Date - 2022-08-20T06:07:46+05:30 IST