జగన్‌తో ముగిసిన సమావేశం.. అలీకి రాజ్యసభ సీటు?

ABN , First Publish Date - 2022-02-15T22:23:17+05:30 IST

ఈ విషయమై అలీని ప్రశ్నించగా తనతో అలాంటివేమీ మాట్లాడలేదని, ఫార్మాలిటీ కోసం పిలిచిరాని, తొందరలోనే మళ్లీ కలుస్తానని అన్నారు. తాను పదవుల కోసం వైసీపీలోకి రాలేదని అన్న ఆయన.. గత ఎన్నికల్లోనే తనకు ఆఫర్ వచ్చిదని, అయితే..

జగన్‌తో ముగిసిన సమావేశం.. అలీకి రాజ్యసభ సీటు?

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు, యాక్టర్ అలీ వేరు వేరుగా సీఎంను కలుసుకున్నారు. చాలా రోజులుగా వైసీపీలో ఉన్న అలీ.. జగన్‌ను కలవడం సాధారణమే. అయితే ఈసారి జరిగిన భేటీకి ప్రాధాన్యత ఉందంటున్నారు. అలీకి త్వరలోనే రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా సమావేశంపై విస్తృత చర్చ జరుగుతోంది.


కాగా, ఈ విషయమై అలీని ప్రశ్నించగా తనతో అలాంటివేమీ మాట్లాడలేదని, ఫార్మాలిటీ కోసం పిలిచిరాని, తొందరలోనే మళ్లీ కలుస్తానని అన్నారు. తాను పదవుల కోసం వైసీపీలోకి రాలేదని అన్న ఆయన.. గత ఎన్నికల్లోనే తనకు ఆఫర్ వచ్చిదని, అయితే తనకు అప్పట్లో అంత సమయం లేకపోవడంతో పోటీ చేయలేదని అన్నారు. ఇక తాజాగా చిరంజీవి సహా కొందరు సినీ పెద్దలు జగన్‌కు కలవడం తెలిసిందే. అయితే ఆ భేటిలో చిరంజీవి బృందాన్ని జగన్ అవమానించారంటూ వస్తున్న ఆరోపణలను అలీ కొట్టిపారేశారు. చిరంజీవి బృందాన్ని పిలిచి అవమానించే అవసరం జగన్‌కు ఏముందని ప్రశ్నించారు.

Updated Date - 2022-02-15T22:23:17+05:30 IST