ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ABN , First Publish Date - 2020-09-20T04:58:38+05:30 IST

ఐపీఎల్ 2020లో భాగంగా అబుధాబీలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ముంబై ఇం

ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

అబూధాబీ: ఐపీఎల్ 2020లో భాగంగా అబూధాబీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. చెన్నై జట్టు ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక చెన్నై నుంచి ఓపెనర్లుగా దిగిన వాట్సన్ 4 పరుగులకు, మురళి విజయ్ ఒక రన్‌కు ఔట్ అయిపోయారు. చెన్నై ఓపెనర్లు కొద్దిపరుగులకే పెవిలియన్ చేరారు. అయితే తరువాత వచ్చిన అంబటి రాయుడు, డూప్లెసిస్ అద్భుతమైన ఆటతో జట్టును ఆదుకున్నారు. అర్థ సెంచరీలతో రాణించారు. అంబటి రాయుడు 48 బంతుల్లో 71 పరుగులు చేయగా.. డూప్లెసిస్ 44 బంతుల్లో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి చెన్నై విజయకేతనం ఎగురవేసింది.

Updated Date - 2020-09-20T04:58:38+05:30 IST