అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో.. కేసీఆర్నే అడగాలి: నాని
ABN , First Publish Date - 2020-10-01T22:31:40+05:30 IST
ఆర్టీసీలో 4,700 మందికి కరోనా వచ్చిందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఇప్పటి వరకు 73 మంది మృతి చెందారని ప్రకటించారు.
విజయవాడ: ఆర్టీసీలో 4,700 మందికి కరోనా వచ్చిందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఇప్పటి వరకు 73 మంది మృతి చెందారని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కాకుండా.. ఒక రోజు కార్మికుల వేతనంతో పరిహారం ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి ఆమోదంరాగానే ఆర్టీసీ కార్మికుల్ని కోవిడ్ వారియర్స్గా గుర్తిస్తామని తెలిపారు. తెలంగాణతో జల వివాదాలకు, బస్సులు నడపడానికి సంబంధం లేదని, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో.. తెలంగాణ సీఎం కేసీఆర్నే అడగాలని పేర్నినాని చెప్పారు.